- image : Courtesy with Surya Telugu news paper
జ : ఆహారం తీసుకోవడానికీ ఓ పద్ధతుంది---ఆహారాన్ని పద్ధతి ప్రకారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు.
* 4 గంటలకు ఒకసారి ఏదైనా ఆహారం తీసుకుంటూ ఉండాలి,
* తినే ప్రతిసారీ కడుపు నిండా తినేయకూడదు,
* ఒకసారి ఆహారం తీసుకుంటే ఆ ఆహారం బాగా జీర్ణమయ్యాకే తరువాతి వేళకు ఆహారం తీసుకోవాలి.
* ప్రోటీన్, ఫైబర్ మరియు ఫాట్తో కూడిన ఆహారాన్ని కూడా తీసుకుంటూ వుండాలి.
* ఉప్పు అధికంగా తీసుకోకూడదు. కొవ్వుతో నిండిన ఆహారాన్ని తీసుకునేలా చేసేది ఉప్పే కాబట్టి.
* కార్బోహైడ్రేడ్లు అధికంగా గల అన్నాన్ని మితంగా తీసుకోవడం మంచిది.
* తాజా కూరగాయల్ని మీ ఆహారంలో మూడుపూటలా తీసుకోండి.
* పండ్లను సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. కానీ నాలుగైదు పండ్లను ఒకసారి తినేయడం మంచిది కాదు.
* ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు తీసుకున్న 2 గంటల తర్వాత పండ్లను తీసుకోవచ్చు.
===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.