ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : పళ్ళపై మరకలు పోయేదెలా?
జ : పళ్ళ గురించి ఎంతగా
శ్రద్ద వహించినా పడిన మచ్చలు , గార తొలగదు . అందుకు సరియైన జాగ్రత్తలు
తీసుకుని కొన్ని కిటుకలు పాటిస్తే తొలగించుకోవడము సులువవుతుంది. కాఫీ , టీ
, వైన్, సోడా అలవాటు మచ్చల కి , గారకు దారితీస్తుంది . వీటిని కొన్ని
గృహచికిత్సలతో తొలగించుకునే వీలు ఉన్నది.
1.స్ట్రాబెర్రీలలో ఉండే
మాలిక్ యాసిడ్ ప్రభావ వంతమయిన టీత్ -వైట్నింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.
స్ట్రాబెర్రీలు చిదిమి , ఆ గుజ్జుతో ముందుగా బ్రెష్ చేసి తరువాత టూత్
పేస్ట్ వాడాలి. ఇలా వారానికి కనీసము ఒకసారైనా చేస్తుండాలి . ఎక్కువసార్లు
చేస్తే దీనిలోని యాసిడ్ పంటిపై ఉండే ఎనామిల్ కు హాని కలిగిస్తుంది.
2.బేకిగ్
సోడాలొ టూత్ బ్రెష్ అద్ది బ్రెష్ చేసుకుని తరువాత సాధారణ పేస్ట్ తో పళ్ళు
తోముకోవాలి. ఎప్పుడైనా నిమ్మరసము చుక్కలు వేసినా ఫలితము బాగుంటుంది.
3 . నెలకోసారి ఉప్పు , బేకింగ్ సోడా నీరు కలిపి బ్రెష్ చేసుకుంటే పళ్ళు తెల్లగా ఉంటాయి. మరీ గట్టిగా రుద్దకూడదు.
4. ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్న కొన్నిరకాల వైట్నింగ్ టూత్ పేస్టులు కూడా ఉన్నాయి.
- *===========================
visit my website - >
Dr.Seshagirirao-MBBS -