ప్ర : గర్భిణి ఏదైనా పదార్ధము తినకపోతే ... పుట్టిన బిడ్డకు ఆ పదార్ధము ఎలర్జీ కలుగజేస్తుందా?
జ : సాధారణము గా చాలామంది పిల్లలలో నట్స్ ఎలర్జీ కనబడుతుంది. ముఖ్యము గా వేరుశనగపప్పు ఎలర్జీ ఎక్కువ--- అయితే అమ్మలు గర్భవతులుగా ఉన్నప్పుడు పీనట్స్ , ట్రీనట్స్ తినాలి . . . అలా తినడము వలన పుట్టిన పిల్లలలో ఆయా ఆహారపదార్ధాల ఎలర్జీలు ఉండవు .
అమ్మలకు వీటి తాలూకు ఎలర్జీలు లేకుండా ఉండి వారములో కనీసము అయిదారు సార్లైనా నట్స్ తింటుంటే పిల్లలకు తదుపరి ఇబ్బందులే ఉండవు . నెలకు ఒకసారి కూడా వీటిని తినని అమ్మలతో పోల్చినట్లైతే , తినేవారి పిల్లలలో ఆహార పదార్ధాల ఎలర్జీలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనాత్మకముగా ఋజువైనది. అంటే గర్భిణీలు బిడ్డకోసము , బిడ్డకు ఎలర్జీ బారినుండి తప్పించడము కోసము అన్నిరకాల పదార్ధములు తినాలి. అదే మనపెద్దలు కడుపుతో ఉన్నవారికి వంటా-వార్పు , ఉండా-పండూ తెచ్చి పెట్టే ఆనవాయితీని ఆచారముగా పెట్టేరు.
- *===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.