జ : శీతాకాలములో పగలు తక్కువగా ఉండడము , చలి ఎక్కువగా ఉండడము వలన జీర్ణ శక్తిలో కొంత తగ్గుదల ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలు , మితముగా ఆహారము తీసుకోవాలి.ఈ క్రింది నియమాలు పాటిస్తే మేలు కలుగుతుంది.
- ఉప్పు , వగరు , ఆమ్లగుణము కలిగిన ఆహారపదార్ధాలు అతిగా తినవద్దు , వీటివలన అజీర్ణము , కడుపు ఉబ్బరము , గాస్ సమస్య వంటివి ఏర్పడతాయి.
- అతిగా వేయించిన కూరలు , మాంసాహారం వంటివి తక్కువగా తీసుకోవడము లేదా అసలు దూరము గా ఉండడము మంచిది. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళవద్దు .
- ఆకుకూరలు బాగా కడిగి శుభ్రం చేయాలి . పచ్చి కూరలు తినడం శీతాకాలము లో మంచిది కాదు .పండ్లు , కాయకూరలు పూర్తి శుభ్రము గా కడకకుండా వాదవద్దు .
- శుచి , శుభ్రత కలిగిన ప్రదేశాలలో ఉండే ఆహారము తీసుకుంటే మంచిది .
- మిగిలి పోయిన ఆహార పదార్ధాలను ఫ్రిజ్ లో దాచిపెట్టి మరుచటి రోజూ తినవద్దు .
- అతి చల్లని నీరు త్రాగవద్దు . ఐస్ క్రీమ్ లు వంటివి అతిగా తీసుకోవడము మంచిది కాదు .
- సులభము గా జీర్ణము అయ్యే కాయకూరలు చక్కగా ఉడికించి తినడము మంచిది.
- వంటకాలకు మంచి నూనె , కొబ్బరినూనె , ఆలివ్ నూనె వంటివి వాడడం మంచిది.
- వీలున్నంత వరకు పాత బియ్యం వాడడము మంచిది.
- *===========================
- visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.