ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *
Q : ఈ మధ్యకాలంలో ఆరోగ్య కార్యకర్తలు అప్పుడేపుట్టిన శిశువుకు నీరు, గ్లూకోజు నీరు, తేనెలాంటి పదార్థాలు తాగించొద్దు అంటున్నారు. ఎందువల్ల?
A : తల్లిపాల ఉత్పత్తికి ప్రధానంగా చేయాల్సింది తల్లులు చిన్నా రులకు తరచుగా పాలుపట్టడం. పాల ఉత్పత్తి పాలు తాగడం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువుకు చాలామంది నీరుగానీ, గ్లూకోజునీరుగానీ, చక్కెరగానీ, తేనెగానీ రకరకాల పదార్థాలు తాగిస్తుంటారు. వీటివల్ల కడుపు నిండి శిశువుపాలు తాగే ప్రయత్నం చేయదు. పాల ఉత్పత్తి ప్రక్రియ జరగదు. అంతేగాక వీటి ద్వారా చిన్నారులు సూక్ష్మజీవుల బారినపడే ప్రమాదముంది. చిన్నారుల రక్షణకు ఉపయోగపడే ముర్రుపాలు వారికి లభించవు.
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.