ప్ర : పళ్ళపై మరకలు పోయేదెలా?
జ : పళ్ళ గురించి ఎంతగా శ్రద్ద వహించినా పడిన మచ్చలు , గార తొలగదు . అందుకు సరియైన జాగ్రత్తలు తీసుకుని కొన్ని కిటుకలు పాటిస్తే తొలగించుకోవడము సులువవుతుంది. కాఫీ , టీ , వైన్, సోడా అలవాటు మచ్చల కి , గారకు దారితీస్తుంది . వీటిని కొన్ని గృహచికిత్సలతో తొలగించుకునే వీలు ఉన్నది.
1.స్ట్రాబెర్రీలలో ఉండే మాలిక్ యాసిడ్ ప్రభావ వంతమయిన టీత్ -వైట్నింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలు చిదిమి , ఆ గుజ్జుతో ముందుగా బ్రెష్ చేసి తరువాత టూత్ పేస్ట్ వాడాలి. ఇలా వారానికి కనీసము ఒకసారైనా చేస్తుండాలి . ఎక్కువసార్లు చేస్తే దీనిలోని యాసిడ్ పంటిపై ఉండే ఎనామిల్ కు హాని కలిగిస్తుంది.
2.బేకిగ్ సోడాలొ టూత్ బ్రెష్ అద్ది బ్రెష్ చేసుకుని తరువాత సాధారణ పేస్ట్ తో పళ్ళు తోముకోవాలి. ఎప్పుడైనా నిమ్మరసము చుక్కలు వేసినా ఫలితము బాగుంటుంది.
3 . నెలకోసారి ఉప్పు , బేకింగ్ సోడా నీరు కలిపి బ్రెష్ చేసుకుంటే పళ్ళు తెల్లగా ఉంటాయి. మరీ గట్టిగా రుద్దకూడదు.
4. ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్న కొన్నిరకాల వైట్నింగ్ టూత్ పేస్టులు కూడా ఉన్నాయి.
- *===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.