ప్ర : చాలా మంది ఎక్షరసైజులు చేస్తున్నప్పుడు ఎ.సి . ఆపేస్తుంటారు. జిమ్ లో లేదా యోగా సెషన్ లో ఉండాల్సిన ఉష్ణోగ్రత ఎంత?.
జ : ఎక్సరసైజులు చేస్తున్నప్పుడు 23 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఐడియల్ టెంపరేచర్ అని అధ్యయనాలలో గుర్తించారు . వేడి వాతావరనం లో వర్కవుట్ల వలన డీ హైడ్రేషన్ వస్తుంది. ఒక్కోసారి వడదెబ్బ అవకాశాలూ ఉంటాయి. వేడిగా ఉన్న గదిలో వర్కవుట్లు లేదా యోగా వంటివి చేయడం వలన అలసటగా ఉంటుంది. చేయాలన్న ఉత్సాహం , స్పూర్తి కూడా తగ్గిపోతాయి.
గదిలో చక్కని వెంటిలేషన్ ఉండాలి . గదిలో ఆక్షిజన్ స్థాయిలు సరిగా లేకపోతే మగతగా ఉంటుంది. వేడి వాతావరణం , దానివలన కలిగే అదనపు స్వేదం శారీరక ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కు ఇబ్బంది కలిగిస్తాయి. ఇలాంటి సమయాలలో వట్టి మంచినీరు త్రాగడం సిఫార్సు చేయదగినది కాదు . పంచధార , ఉప్పు కలిపిన నిమ్మ నీరు తాగాలి లేదా ఓరల్ రీహడ్రేషన్ సొల్యూషన్ త్రాగాలి.
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.