Q : నా వయసు 38 సంవత్సరాలు. దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి (సికెడి) నాలుగోదశతో బాధడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాలన్నారు. కచ్చితంగా వారానికి మూడుసార్లు చేయించుకోవాలా? ఒక సారిగాని, రెండు సార్లు గాని చేయించుకుంటే సరిపోతుందా? సలహా ఇవ్వగలరు.
ఆంజనేయులు, హుజూరాబాద్
A : కిడ్నీ (మూత్రపిండాలు) పని శాతం 15 కంటే తక్కువ ఉన్నప్పుడు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి నాలుగోదశ అంటారు. ఈ దశలో డయాలసిస్ అవసరం ఏర్పడుతుంది. ఒకసారి ఈ దశకు చేరుకున్న తర్వాత కచ్చితంగా వారినికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవడం మంచిది. కొంత మంది ఒక సారి లేదా రెండుసార్లు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఏ ఇబ్బందులు ఉండవు. కానీ క్రమం తప్పితే డయాలసిస్ చేయించుకోవడం వల్ల ఇతర అవయవాల మీద దీని దుష్ఫలితాలు ఉంటాయి. ఇలా క్రమరహితంగా డయాలసిస్ చేయించుకోవడం వల్ల గుండె పనిచేయడం తగ్గుతుంది. జీవన ప్రమాణాం తగ్గే అవకాశముంది.
--డాక్టర్ శ్రీధర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్అవేర్గ్లోబల్హాస్పిటల్,హైదరాబాద్.
- ==================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.