రమ్య - నరసన్నపేట.
జ : రోజులో ఓ భోజనము మానేస్తే బరువు తగ్గుతామని చాలామంది భావిస్తారు . కాని ఇలా మానేసినప్పుడు శారీరక మెటబాలిజం పడిపోతుంది . తదుపరి భోజనము ఎప్పుడు తింటామో తెలియని శరీరము ప్రతి క్యాలరీని స్టోర్ చేయడం ఆరంభిస్తుంది . దీనికి బదులు నిర్ణీత వేళల్లో ఆహారము తింటుండడం వల్ల జీవక్రియ చురుగ్గా ఉంటుంది . శరీరము పోషకాల్ని జీర్ణము చేసుకుంటుంది .
సరియైన ఆహారము తినడం అవసరము . తక్కువ క్యాలరీలు ఉండే పండ్లు , కూరగాయలు , బాగా పోషకాలు లభంచే ఆహారము తినాలి . క్యాలరీలు తక్కువ ఉండి పోషకాలు అధికముగా లభించే గింజలు , లెంటిల్స్ , నట్స్ , ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ ఉండే ఆహారము తినడం వల్ల అందుకు తగిన వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గుతారే తప్ప ఆహారము మానేయడం వల్ల కాదు .
--Dr.Seshagirirao-MBBS
- ==============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.