జవాబు : ఒక్కోసారి భోజనం చేస్తుంటే చటుక్కున పచ్చిమిరపకాయముక్క నమిలేస్తాం. ఇంకేముంది నోరంతా ఒకటే మంట. ఇలాంటప్పుడు మీరేం చేస్తారు? ఏముంది వెంటనే ఓ గ్లాసు మంచినీళ్లు తాగుతాం అంటారు కదూ! కానీ మంచినీళ్లు ఘాటును తగ్గించలేవట. ఎందుకంటే.. పచ్చి మిరపకాయ నమలగానే అందులోని నూనె గుణాలు నోరంతా విస్తరిస్తాయి. ఈ సమయంలో మంచినీళ్లు తాగితే అవి నూనెను గ్రహించలేవు. అందుకే వెంటనే ఘాటు తగ్గదు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా..! రెండు చుక్కల మజ్జిగ లేదా చెంచా పెరుగును నోటిలో వేసుకోండి. ఇవి నూనెనంతా గ్రహించివేసి కారాన్ని తగ్గిస్తాయి. అదే పిల్లలకైతే అరగ్లాసు పాలు లేదా ఓ బ్రెడ్డు ముక్క తినిపించండి .
- =======================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.